Header Banner

రష్యాపై ఎన్నడూ లేనంత భీకర దాడులు చేసిన ఉక్రెయిన్...! భారీ విధ్వంసం!

  Mon Jun 02, 2025 07:37        Others

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు రష్యాపై ఉక్రెయిన్ మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల తీవ్రత ఎంతగా ఉందంటే, ఉక్రెయిన్ సరిహద్దుకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని కీలక వైమానిక స్థావరం కూడా దద్దరిల్లింది. ఇరు దేశాల మధ్య రేపు (జూన్ 2) ఇస్తాంబుల్‌లో కీలక శాంతి చర్చలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

'ఆపరేషన్ స్పైడర్ వెబ్' (పవుటినా) అనే సంకేతనామంతో ఉక్రెయిన్ భద్రతా విభాగం (ఎస్‌బీయూ) అత్యంత రహస్యంగా, ఏడాది పాటు ప్రణాళిక రచించి ఈ మెగా ఆపరేషన్‌ను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా బెలాయా (తూర్పు సైబీరియా), ఫిన్‌లాండ్ సమీపంలోని ఆర్కిటిక్‌లోని ఒలెన్యా, మాస్కోకు సమీపంలో ఉన్న ఇవనోవో, డ్యాగిలెవో వంటి పలు కీలక రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో సుమారు 40కి పైగా రష్యా విమానాలు ధ్వంసమయ్యాయని, వీటిలో అత్యాధునిక టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, ఒక ఏ-50 నిఘా విమానం కూడా ఉన్నాయని ఉక్రెయిన్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, యుద్ధంలో ఉక్రెయిన్ జరిపిన అత్యంత విధ్వంసకర డ్రోన్ దాడిగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది, మాస్కోకు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇది కూడా చదవండి: తల్లికి వందనంపై బిగ్ అప్డేట్! ఇలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!


సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని స్రిద్ని గ్రామంలో తమ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయాన్ని ఆ ప్రాంత రష్యా గవర్నర్ స్వయంగా ధృవీకరించడం గమనార్హం. యుద్ధ క్షేత్రాలకు అత్యంత దూరంలో, రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ శత్రువుల బాంబర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. 

సరకు రవాణా ట్రక్కులపై అమర్చిన మొబైల్ చెక్క షెడ్లలో డ్రోన్‌లను దాచిపెట్టి, నిర్ణీత సమయాల్లో ట్రక్కుల పైకప్పులను రిమోట్‌గా తెరిచి, డ్రోన్‌లను ప్రయోగించినట్లు సమాచారం. రష్యా వద్ద ఉన్నంత విస్తృతమైన క్షిపణి నిల్వలు లేని ఉక్రెయిన్, వ్యూహాత్మకంగా డ్రోన్లనే ప్రధాన ఆయుధంగా మలుచుకుంటోంది.

ఇదిలా ఉండగా, రేపు ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీలు మరియు అపహరణకు గురైన పిల్లల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అయితే, ఈ పెను డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇస్తాంబుల్ చర్చల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడులకు రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #UkraineRussiaWar #UkraineStrikes #RussiaUnderAttack #MassiveDestruction #WarUpdate